Monday, August 20, 2018

బిగ్ బాస్ హౌస్ నుంచి దీప్తి సునైనా ఔట్....ఎలిమినేషన్ కి అదే కారణమా....!!!!

బిగ్ బాస్-2 ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో దీప్తి సునైనా నిష్క్రమించింది. ఎట్టకేలకు 64 రోజుల ప్రయాణం ఆదివారంతో ముగిసింది. ఈ సారి నామినేషన్లో 6 గురు ఇంటి సభ్యులు ఉండగా అందులో ముగ్గురు ఇంటి సభ్యులు శనివారం రోజు సురక్షిత జోన్ లోకి వెళ్లగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా అతి తక్కువ ఓట్లతో దీప్తి సునైనా ఇంటి దారి పట్టింది. కాగా ఈ ఎపిసోడ్ కి విజయ్ దేవరకొండతో పాటుగా గీతే గోవిందం దర్శకుడు పరుశురాం హాజరవ్వడం విశేషం. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా దీప్తి సునైనకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని మరియు విజయ్ దేవరకోండ ఒక సీక్రెట్ టాస్క్ ని ఇవ్వటం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా తనకి బ్లూటూత్ తో పాటుగా కాల్ ని హోస్ట్ నాని మరియు అతిధి గా వచ్చిన విజయ్ దేవేరకొండకి కనెక్ట్ చేయటం జరిగింది. అయితే ఇంటి సభ్యులవరికి తెలియకుండా తాము చెప్పే పనులన్నీ చేయాలని చెప్పటం జరిగింది. అయితే ఎపిసోడ్ మొత్తం కొంచెం సరదాగా సాగుతూ వచ్చింది. ఇక ఎపిసోడ్ చివరకి ఎలిమినేషన్ వంతు వచ్చింది. ఇక హోస్ట్ నాని దీప్తి సునైనా నిష్క్రమించినట్టుగా ప్రకటించాడు.

Deepthi Sunaina Elimination

ఈ క్రమంలో భాగంగా ఇంటి సభ్యులంతా భావోద్వేగానికి లోనయ్యారు. 64 రోజులు తమతో ఉండి ఒకే సారి ఇలా వెళ్లిపోతుండడంతో ఇక ఇంట్లో అల్లరి వెళ్లపోతుండడంతో చాలా బాధ పడ్డారు. ఇక తనీష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఎంతో స్నేహంగా మెలిగిన దీప్తి సునైనా వెళ్లిపోతుండడంతో చివరికి ఏడ్చేశాడు. కానీ దీప్తి సునైనా ఎలిమినేట్ అవ్వటానికి కాల్ సెంటర్ టాస్క్లో కౌశల్ తో మాట్లాడిన తీరే ఒక కారణంగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

Artikel Terkait

Powered by Blogger.