Saturday, October 27, 2018

రాజమౌళి సినిమాలో కొత్త ట్విస్ట్...... విలన్ గా యంగ్ టైగర్.....!!!!

రాజమౌళి....తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు... ఇక తన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. బాహుబలి సినిమా తర్వాత తనపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రంలో కొత్త కొత్త ట్విస్టులు బయటికి వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ సినిమా తీయబోతున్నానని రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుబోయే సినిమా ఇదే కావడం విశేషం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగలో తన నట విశ్వరూపం ప్రదర్శించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇక ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను కేవలం నాయకుడు గానే చూసాం. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ లో మరో కొత్త కోణం చూడబోతున్నాం. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రతి నాయకుడు గా కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి పోతాడనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకి కన్నుల పండుగ కానుందనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

Sunday, October 21, 2018

పెళ్లి పీటలేక్కబోతున్న రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే....

రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే బాలీవుడ్ తెర పై ఎన్నో చిత్రాల్లో నటించింది ఈ జంట. ఎన్నో రోజులుగా ఈ జంట తెర వెనుక ప్రేమాయణం సాగిస్తున్న విషయం చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ప్రేక్షకులు మరియు మీడియా ఈ విషయం గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేస్తూ వచ్చారు. ఇక ఆ విషయాన్నే నిజం చేస్తూ మొట్ట మొదటి సారిగా అధికారికంగా ప్రకటించేశారు. ఇక ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని రణ్ వీర్ సింగ్ మరియు దీపికా పడుకొనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక వాళ్లపై వచ్చిన రూమర్లు అన్ని నిజం చేస్తూ ట్విట్టర్ వేదికగా తమ సంతోషాన్ని అభిమానులతో మరియు మీడియా తో పంచుకున్నారు. పలు చిత్రాల్లో ఒకటిగా కలిసి నటించిన ఈ జంట నవంబర్ 19వ తేదీన ఒకటి కాబోతున్నారు. ఇక ఇప్పటి వరకు వీరు పద్మావత్ మరియు బాజిరావ్ మస్తానీ వంటి హిట్ పలు చిత్రాల్లో నటించారు.

Friday, October 19, 2018

అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం.....50 మంది మృత్యువాత

పంజాబ్ రాష్ట్రం అమృతసర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయ దశమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రావణ దహనం సమయంలో ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలకు సమీపంలో కొందరు నిలబడి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమయంలో అటుగా వస్తున్న రైలు ఒక్క సారిగా వారిని ఢీ కొనడంతో దాదాపు యాభై మంది ప్రాణాలు కోల్పోయారు. దహనం చేసే ప్రక్రియ లో భాగంగా జోరుగా టపాకాయల శబ్దం రావడంతో రైలు కూత ఎవరికి వినపడక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తో అమృత్ సర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం అంతా రక్త సిక్తంగా తయారైంది. రావణ దహనం సమయంలో రైలు పట్టాలు పైన నిలబడి ఫోటోలు తీయడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఘటన లో చాలా మంది గాయపడ్డారు. క్షతగాత్రులని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన పై పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కానీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో సిద్దు అక్కడే ఉండడం కనీస భాధ్యత కూడా లేకుండా వారిని పట్టించుకోకుండా వెళ్లడం తీవ్ర అసహనానికి గురి చేసిందని స్థానికులు వాపోయారు.


Wednesday, October 17, 2018

తెలంగాణ లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ....

తెలంగాణ రాష్ట్రం అంటే సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక బతుకమ్మ పండుగ విషయానికి వస్తే వేరే చెప్పనక్కరలేదు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంస్కృతి అని చెప్పవచ్చు. తెలంగాణ ఆడ పడుచులు, ఆడ బిడ్డలు ఎంతో వైభవంగా జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూల బతుకమ్మ తో మొదలైన ఈ పూల పండుగ నేటితో తొమ్మిదవ రోజులు పూర్తి చేసుకుంది. ఈ తొమ్మిదవ రోజునే తెలంగాణ ప్రజలు సద్దుల బతుకమ్మ గా పిలుచుకుంటారు. ఈ బతుకమ్మ రోజున ఊరు ఊరంతా ఏకమై పూల పండుగని అంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దారి పొడవునా వెళ్లి బతుకమ్మ ని ఊరి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ లతో చేరువులన్నీ నిండి నీటిలో పూవుల కొలను ఏర్పడినట్టుగా ఎంతో రమ్యంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే దేవుడిని పువ్వులతో కొలుస్తాం. కానీ పువ్వులనే దేవుడిగా మలిచిన ఘనత ఒక తెలంగాణకే దక్కుతుందనడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఏటా బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహస్తోంది. ఊరూరా బతుకమ్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని ఉత్తేజ పరుస్తోంది.

Saturday, October 13, 2018

అరవింద సమేత.....రికార్డుల మోత....కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న వీర రాఘవుడు.....!!!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే మొదటి సారి. వీళ్ళ కలయిక లో సినిమా కోసం ప్రేక్షకులు కూడా చాలా ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిత్రం విడుదలై రెండు రోజులే అయినా 300 కోట్ల గ్రాస్ ని ఇప్పటికే సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మరోసారి చూపించాడనే చెప్పాలి. అయితే ఈ చిత్రం చాలా వరకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కథాంశం ప్రకారం తెరకెక్కిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యాక్షన్ కథలో నటించడం మరో విశేషం. అయితే త్రివిక్రమ్ తన చిన్న నాటి మిత్రుడైన సునీల్ కి ఈ చిత్రం లో ఒక మంచి రోల్ ఇచ్చాడని చెప్పాలి. ఇక జగపతిబాబు విషయం వేరే చెప్పనక్కర్లేదు. ఇక త్రివిక్రమ్ జగపతిబాబు పాత్రని చాలా అద్భుతంగా మలిచారు. విలనిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 

కథ విషయానికి వస్తే....

అరవింద సమేత వీర రాఘవ.... టైటిల్ పెట్టడంలో కూడా తన మాయాజాలాన్ని చూపించాడు. ఇక కథ గురించి వేరే చెప్పనక్కరలేదు. 5 రూపాయల నుంచి మొదలైన గొడవ ఫ్యాక్షన్ గోడవగా ఎలా మారింది? మరి వీర రాఘవుడు ఫ్యాక్షన్ గొడవలను నిలువరించాడా? వీర రాఘవుడి నానమ్మ చెప్పిన నీతి ఏంటి? అసలు కథ ఎలాంటి మలుపులు తిరిగింది. ఇవ్వన్నీ తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.

Friday, October 12, 2018

కళ్ళు మూస్తే బీజేపి..... తెరిచేలోపు కాంగ్రెస్.... రెప్ప పాటున పార్టీ మార్పు....!!!

రాజకీయ నాయకులు పదవుల కోసం సీట్ల కోసం పార్టీలు మారడం యాదృచ్చికమే ఆయిన నిన్న జరిగిన ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలక్షన్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర రాజనర్సింహ సతీమణి నిన్న ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం విదితమే. అయితే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో తెలియదు గానీ, సాయంత్రానికే ఆ పార్టీని వీడుతున్నట్టు సంచలన ప్రకటన చేసి అందరిని షాక్ కి గురి చేశారు. ఇంకా బీజేపీ నాయకుల నుంచి ఈ విషయం పై ఎటువంటి ప్రతి స్పందన రాకపోవడం గమనార్హం.


అయితే ఈ విషయం పై దామోదరం రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తల మరియు అభిమానుల ఆవేదన చూడలేకే మళ్ళీ సొంత గూటికి చేరినట్టు చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయం పై నెటిజన్లు నానా రకాలుగా గుసాగుసలాడుకుంటున్నారు.

Wednesday, October 10, 2018

మాటే కాదు పాట కూడా.....దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి బతుకమ్మ గానం

బిత్తిరి సత్తి.... తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఓ టీవీ ఛానెల్ ద్వారా బిత్తిరి సత్తి గా తెలుగు ప్రజలకు పరిచయమై తనదైన భాష లో విచిత్రమైన హావభావాలతో తెలుగు ప్రజల్ని నవ్వుల లోకంలో ముంచెత్తుతున్నాడు. తను స్క్రీన్ పైన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ఉన్నంత సేపు తన సంభాషణతో ప్రేక్షకుల మొఖంలో నవ్వుల పువ్వులు పూయించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తను బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు.


ఒక మారు మూల పల్లె నుంచి వచ్చిన బిత్తిరి సత్తి పేరు తెలంగాణ లోని పల్లెల్లోనే కాదు దేశ విదేశాలోను మారు మ్రోగిపోతుంది. ప్రేక్షకుల్ని నవ్వుల లోకంలో ముంచెత్తడమే కాకుండా, తనలో ఉన్న ప్రతిభని ఎక్కడో ఒక చోట బయట పెడుతూనే ఉన్నాడు. కొన్ని స్టేజి షోలలో తన డాన్సులతో కూడా అలరించిన విషయం విదితమే. ఇదే కాకుండా ఈ మధ్యే తుపాకీ రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తన గాత్రంతో కూడా మాయాజాలం చేశాడనే చెప్పాలి. బతుకమ్మ పండుగ సందర్భంగా తను పాడిన పాట యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. కేవలం మూడు రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ మార్క్ అందుకుని సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతుంది.

Monday, October 8, 2018

ముదిరిన మాటల యుద్ధం..... డి కె అరుణ, కేసీఆర్ ల మధ్య రగులుతున్న చిచ్చు....!!!!!!

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకి కేవలం కొన్ని రోజుల గడువే ఉండడంతో ఎవరి పంథాలో వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. పార్టీల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా దూషణలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి మరియు కేసీఆర్ ల మధ్యనే మాటల యుద్ధం జరుగగా, తాజాగా డీకే అరుణ తన స్వరాన్ని కొంచెం ఘాటుగానే వినిపిస్తోంది. కేసీఆర్ అన్న ప్రతి మాటను తిప్పి కొడుతూ ప్రచారంలో దూసుకువెళ్తోంది. ఇక కేసీఆర్ కూడా డీకే అరుణకు తనదైన స్టయిల్లో బుద్ది చెబుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే అసలు విషయం పక్కన పెట్టి మాటకు ప్రతి మాట ఇవ్వడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఇదే రచ్చ కొనసాగుతూ వస్తోంది. ఇదిలా ఉండగా డీకే అరుణ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందో, మహా కూటమి స్పష్టతని ఇవ్వలేదు. డిసెంబర్ 7వ తేదీనే తెలంగాణ లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని ప్రకటించగా నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత వరకు అభ్యర్ధులని మాత్రం ప్రకటించలేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో అభ్యర్ధులని ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.

Friday, October 5, 2018

బిగ్ బాస్-2 విజేత కౌశల్ కి మరో గుర్తింపు.... గిన్నిస్ బుక్ లో చోటు...!!!

బిగ్ బాస్-2 విజేత కౌశల్ కి మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. బిగ్ బాస్ షో పూర్తి అయి వారం రోజులు గడిచినా కౌశల్ మానియా మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మరియు బడా దర్శకుల నుండి అభినందనల వెల్లువ కొన సాగుతూనే ఉంది. స్వయంగా ప్రిన్స్ మహేష్ బాబు గారే తనని పొగడ్తలతో ముంచెత్తడంతో కౌశల్ క్రేజ్ ఏ విధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో నుంచి మొదటే నిష్క్రమించిన బాబు గోగినేని మరియు తేజస్వి కౌశల్ పై తమ వైఖరి ని ఏ మాత్రం మార్చుకోలేదు. ఎదో ఒక విధంగా కౌశల్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు. తను బయట ఆర్మీ ని సృష్టించి వచ్చాడని, తన ఓట్లన్నీ కొన్నవే తప్ప అభిమానం తో వేసింది కావని చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా కౌశల్ కి ఒక్క సారిగా ఎవరికి రాని క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి పోరాటం చేసిన కౌశల్ కి బయట ప్రేక్షకుల అండతో విజేత గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరికీ రాని ఓట్లు కౌశల్ కి వచ్చాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు రాష్టాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు దేశ విదేశాల నుండి కూడా కౌశల్ కి ఓట్ల వెల్లువ కురిసింది. ఇక ఓట్ల వారిగా చూసుకుంటే కౌశల్ కి మొత్తంగా 35 కోట్ల ఓట్లు వచ్చాయని తెలుస్తుంది. బిగ్ బాస్ చరిత్ర లో ఒకే కంటస్టెంట్ కి ఇంత మొత్తం లో ఓట్లు రావడం ఇదే మొదటి సారి. ఈ కారణం చేతనే బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రపంచ రికార్డు ని సొంతం చేసుకోబోతున్నాడు. గిన్నిస్ బుక్ లో తన పేరుని లిఖించబోతున్నాడు.

Thursday, October 4, 2018

కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం కొంప ముంచనుందా....అసలు ఏం జరగబోతోంది....!!!!

అసలు కేసీఆర్ వ్యూహ రచన ఏంటి? ముందస్తు కి వెళ్ళడానికి గల కారణం ఏంటి? నిజం చెప్పాలంటే ఇది ఎవరికి అంతు చిక్కని చిక్కు ముడి. ఈ చిక్కు ముడిని విప్పాలంటే కేసీఆర్ మదిలోని మాటలను బయట పెట్టాల్సిందే. ఎన్నికలకు 9 నెలలకు ముందుగానే  ఎన్నికల నగారా మోగించాడంటే ఇక ఆ విషయం కేసీఆర్ గారికే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శనాస్రాలు గుప్పించుకుంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టేందుకు కేసీఆర్ తనదైన శైలిలో ఎత్తుగడలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ ని దెబ్బ కొట్టేందుకు తెలంగాణ లో మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకం కాగా, అవేవి తన వేగాన్ని అడ్డుకోలేవన్న రీతిలో, తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. 
ఇప్పటికే   తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహా కూటమి తన మేనిఫెస్టో తో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేసీఆర్ కూడా మహాకూటమితో పాటు, పార్టీల పరంగా కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
ఈ విషయం పై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ, తను ఏర్పాటు చేసిన సభలు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. ఎన్నో అంచనాలతో ముందస్తు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కొంగర కలాన్ సభ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం కూడా ప్రజలకు నిరుత్సాహం కలిగించిందనే చెప్పాలి. ఇక సభకి తను ఊహించనంత జన సమూహం కూడా రాలేదని కేసీఆర్ నిరుత్సాహ పడినట్లు తెలుస్తోంది.  ఇక ప్రజల్లో కూడా ఈ సభ పై వ్యతిరేకత లేకపోలేదు. కేసీఆర్ తన ఉపన్యాసాన్ని చాలా తక్కువ సమయంలో ముగించడం అందరిని నిరాశకు గురి చేసింది. ఇక సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సభ హరీష్ రావు గారి అండతో పరవా లేదనిపించింది. ఇక నిజామాబాద్ సభ విషయానికి వస్తే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇంకా మున్ముందు జరిగే సభల్లో కేసీఆర్ గారు తన మార్క్ ని ప్రదర్శించాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తన మేనిఫెస్టో ని కూడా ప్రకటించలేదు. ఏం జరుగుతుందో, తన వ్యూహాలెంటో మరియు మున్ముందు జరిగే పరిణామాలేంటో తెలుసుకోవాలంటే ఇక కొంత సమయం వేచి చూడాల్సిందే.

Sunday, September 30, 2018

బిగ్ బాస్-2 విజేత కౌశల్.... రన్నరప్ గా గీతా మాధురి...కౌశల్ సంచలన నిర్ణయం......!!@@

ఎట్టకేలకు 100 రోజుల బిగ్ బాస్ ప్రయాణం నేటితో ముగిసింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఈ 100 రోజులు మన ఇంట్లో మనుషులు గా కలిసిపోయిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు బిగ్ బాస్ ఇంటికి సెలవు పలికేసారు. ఫినాలే ఎపిసోడ్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో మరియు టీవీ ల ముందు కూర్చుని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల సమక్షంలో విజేత ను ప్రకటించడం జరిగింది. ఒక అద్భుతమైన ఘట్టానికి తెర పడింది. ముందుగా ఫినాలే కి చేరిన అయిదుగురు ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ స్టేజ్ పైకి పిలిచారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే అందరి కంటే ముందుగా ఫైనల్ చేరిన సామ్రాట్ ముందుగా ఎలిమినేట్ కాగా తర్వాత దీప్తి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు ఇంటి సభ్యులు మిగలగా మూడో వ్యక్తిగా తనీష్ ని కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది.
ఇక అసలు కథ తనీష్ ఎలిమినేషన్ తర్వాత మొదలైంది. ఇంట్లో ఇద్దరు సభ్యులు మిగలగా, వారిద్దరిని నాని స్టేజి పైకి తీసుకుని రావడం జరిగింది. ఇక విజేత ప్రకటించే సమయంలో విక్టరీ వెంకటేష్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొద్ది సేపు నాని మరియు విక్టరీ వెంకటేష్ లు దోబూచులాడగా, చివరికి నాని టీవీ లో విన్నర్ ని ప్రకటించడం జరిగింది. ఇక చివరకి విజేతగా కౌశల్ నిలవగా రన్నరప్ గా గీత మాధురి నిలిచింది. దీంతో  100 రోజుల బిగ్ బాస్ ప్రయాణానికి తెర పడింది. ఇక చివరలో విజేతగా నిలిచిన కౌశల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల చికిత్స నిమిత్తం ఖర్చు చేస్తానని చెప్పి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక విజేతగా నిలిచిన కౌశల్ కి పలువురు సినీ ప్రముఖులు  ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

ఈరోజు బిగ్ బాస్ ఫినాలే....100 రోజుల ప్రయాణానికి నేటితో తెర...!!!

బిగ్ బాస్ షో దాదాపుగా మూడు నెలల క్రితం ప్రారంభమైన ఈ షో నేటితో ముగియనుంది. అంతిమ విజేత ఎవరో తెలుసుకోవాలని ప్రేక్షకులు యావత్ తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూడు నెలలు మన ఇంట్లో మనుషుల్లాగా కలిసిపోయి తెలుగు ప్రజలందరినీ మరో లోకం లోకి తీసుకుపోయిన ఈ షో కి నేటితో తెర పడనుంది. షో ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా ప్రారంభమైన ఈ షో రోజులు గడుస్తున్న కొద్దీ తనదైన స్టయిల్లో అలరించి ప్రేక్షకుల మెప్పుని పొందింది. ప్రతిక్షణం టాస్క్లతో మనల్ని ఉత్తేజపరుస్తూ పరుస్తూ ఒక కొత్త అనుభూతిని మనకు పరిచయం చేసింది. ఇన్ని రోజుల ప్రయాణంలో మనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మన అక్కున చేర్చింది. 16 మంది కొత్త ఇంటి సభ్యులను తెలుగు ప్రజల కుటుంబ సభ్యులను చేసింది. తెలుగు ప్రజలు నిజంగా ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇక సామాజిక మాధ్యమాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతి రోజు ఎవరి నోట విన్నా బిగ్ బాస్, ఎవరి ఇంట్లో చూసినా బిగ్ బాస్, నిజంగా ఈ 100 రోజుల బిగ్ బాస్ తెలుగు ప్రజలకి ఊపిరి అయింది. ఏ షో కి దక్కనంత పాపులారిటీ దక్కిందంటే ఇక వేరే చెప్పనక్కరలేదు. ఇక చివరికి విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. చూద్దాం ఎవరు విజేత గా నిలుస్తారో....

Saturday, September 29, 2018

ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురి చేసిన బిగ్ బాస్....ఇంటి సభ్యులందరు షాక్.....! కారణం ఏంటో తెలుసా

బిగ్ బాస్ హౌస్ ఒక్క సారిగా నిండు కుండలా తయారయింది. ఇంటి సభ్యులందరూ ఒక్క సారిగా షాక్ కు గురి అయ్యారు. బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరుతున్న తరుణంలో ఇంట్లోని సభ్యులని మరియు ప్రేక్షకులని ఉత్సాహ పరచడానికి బిగ్ బాస్ తనదైన స్టయిల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముందుగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి సభ్యులని ఆక్టివిటీ గదిలోకి పిలిచి తుది పోరుకు చేరిన అయిదు గురు సభ్యులని అభినందించారు. ఇన్ని రోజుల ప్రయాణంలోని మధుర స్మృతులని గుర్తు చేస్తూ ఇంటి సభ్యులందరిని భావోద్వేగానికి గురి చేశారు.
ఇక ఆ తర్వాత అసలు కథ షురూ అయింది. ఒక్కసారిగా ప్రేక్షకులని మరియు ఇంటి సభ్యులందరిని ఆశ్ఛర్యనికి గురి చేశారు. అదేంటంటే బిగ్బాస్ షో నుంచి నిష్క్రమించిన ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్లో తన స్నేహితులని చూసే సరికి ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఫినాలే జరిగే వరకు ఇంటి సభ్యులంతా ఇంట్లోనే కొనసాగే అవకాశాన్ని ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్ బాస్ కల్పించడం జరిగింది. బిగ్ బాస్ చివరి రోజు ఇంకా హౌస్లో ఎన్ని విశేషాలు జరుగుతాయో వేచి చూడల్సిందే....

Saturday, September 8, 2018

పవన్ ఫాన్స్ కి తీపి కబురు....ఎన్నికలలోపు మరో సినిమా... ..!!!!

అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి తీపి కబురు అందనుంది. పవన్ కళ్యాణ్ 26   చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇది నిజంగా పవన్ ఫాన్స్ పండగ చేసుకోవాలిసిన విషయమే. అసలు సినిమాలు చేస్తాడా చెయ్యడా అన్న విషయంలో ఫాన్స్ ని కొంచెం సందిగ్ధంలో పడేసిన పవన్, ఇక తన తర్వాతి సినిమా పై ఒక క్లారిటీ ఇవ్వడంతో ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే, ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండడంతో, ఎన్నికల రణరంగంలోకి దిగేలోపు ఒక సినిమా చేయాలనీ యోచిస్తున్నాడట. ఇంకా టైటిల్ ఏం ఖరారు చేయలేదు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం ఒక మంచి కథతో రెడీ గా ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం
Pawan Kalyan 26th Movie
Pawan Kalyan
ఎన్నికలు మొదలయ్యేలోపు నిర్మాతగా కూడా మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఇంతకీ హీరో ఎవరనుకుంటున్నారా? స్వయానా తన మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ తేజని తెరంగ్రేటం చేయించే యోచనలో ఉన్నాడట. మరి ఇది ఎంత వారికి సాధ్యపడుతుందో వేచి చూడాలి.

Blog Archive

Powered by Blogger.